రాయప్రోలు సుబ్బారావు గారి వివరాలు
![]() |
రాయప్రోలు సుబ్బారావు గారు |
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (మార్చి 17, 1892 - జూన్ 30, 1984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు. భావకవుల్లో కూడా కొందరు ఆద్యులు, కొందరు ఆఢ్యులు. రాయప్రోలు సుబ్బారావు గారు నిస్సందేహంగా ఆద్యులే. భావకవిత్వం ప్రాచుర్యం పొందడానికి వ్యాసముద్రణలు కాదు. శ్రోతలముందు భావకవితాపఠనం ముఖ్యం.
- సుబ్బారావుగారు మెట్రిక్ దాకా చదివి, ముందుకు కొనసాగించలేని పరిస్థితుల్లో రాజమండ్రి చిలుకూరు వీరభద్రరావు సంపాదకత్వంలోని 'ఆంధ్రకేసరీ పత్రికలో రచనలుచేయడం, అజ్ఞాతసంపాదకుడి విధులు, మేనమామతో ఆశు కవితాజంటవిన్యాసాలు స్వత:రసదృష్టి పెరిగినా, ఆశుకవితలమీద వెగటుతనం ఆవహించి, వాటిపై సన్యాసందాకా పోయింది.
- న్యాయవాది గంటిలక్ష్మన్నపంతులు ప్రోద్బలంతో ఆంగ్లకవి 'గోల్డ్ స్మిత్ - హెర్మిట్' కౄతిని 'లలితా(1909)గా, టెన్నిసన్క్ రచన - 'డోరా'ను 'అనుమతీ(1910) లఘుకావ్యంగాను, 'తృణకంకణం'(1912) నూతనరచనలను సౄష్టించాలని సంకల్పంతోనే ఆశుకవిత్వానికి వీడుకోలు పలకవలసి వచ్చింది.
- మదరాసు చేరుకుని, కొమర్రాజు వారి దగ్గర 'విజ్ణానచంద్రికాగ్రంధమండలీ, 'ఆంధ్రవిజ్ణానసర్వస్వం' లో లేఖకునిగా ఉద్యోగం చేశారు.
- విశిష్టకవిత్వానికి అనాదరణ ఆనాటి నుంచే మొదలైంది. ఆధునిక కవిత్వరచనలు చేస్తున్నా కూడ, రాయప్రోలు వారి 'కొత్తపోకడలు" లోకం గుర్తింపుకు నోచుకోలేదు. వీరి కావ్యాలు మొదటదశలో ఎవరి దౄష్టిని ఆకర్షించలేదు.
- కవితలు, కావ్యాలు వ్రాస్తున్నా, ఆనాడు అధికంగా వ్యాప్తి వున్న వరకట్నం దురాచారాన్ని భరించలేకపోయారు.
- ప్రత్యక్ష ఘటన, బ్రాహ్మణయువతి 'స్నేహలత" స్వయంకృతంగా అగ్నిజ్వాలకు ఆహుతికావడం అనేక కవులకు ప్రేరణ కలిగించింది.
- ఈ ఇతి వృత్తంతో నవీనశైలితో పద్యకావ్యం రాయప్రోలుకు కలిగిన నూతన దృ ష్టితో వంగదేశం వలసపోయారు.
- విశ్వకవి రవీంద్రుని అంతేవాసితనం, సాహిత్యసౌందర్యాలను స్వంతంచేసుకుని, స్వదేశం వచ్చారు.
- కాల్పనికకవిత్వం, జాతీయోద్యమం, ఆంధ్రోద్యమంతో ప్రభావంచెంది, 'ఆంధ్రావళీ అవతరణకు దారితీసింది.
- ఈ ప్రభావం, రామమోహన గ్రంధాలయంలో (1916) 'హౄదయములను చేల్చి చదవమనీ సదయులందరికి సందేశాన్నిచ్చారు.
తెలుగు సాహిత్య యుగకర్త
తెలుగుసేమలోని విద్యావంతులు బెంగాలులో వన్నెలుపోతున్న భావచైతన్యం వల్ల ప్రభావితమవుతున్న కాలంలో, తమ మాతౄభాషలో తోటివారికోసం సంకల్పించిన పధం నిర్మిస్తున్న కాలమది. సాహితీభాషామూర్తులు అనుకున్నది సాథించడానికి దారులు తమరే పరచుకుంటున్న పవిత్ర సాహితీపథాలవి. యిరవయ్యవ శతాబ్దపు చివరి దశకకాలం. 1891-92 సంవత్సరం. భావిభారత నవ్యాంధ్ర సాహితీముర్తిత్వానికి సంకేతంగా గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో ఒక మాతౄమూర్తి పురుడుపోసుకుని పుత్రున్ని కన్నది. అది రాయప్రోలు వారి వంశం. పసివాడి పేరు వేంకటసుబ్బారావు. వారి కవిత్వాన్ని, ప్రక్రియని ఒక రకమైన 'సాహితీయుగం - యుగకర్త గా చెలామణి కావడాన్ని బట్టి రాయప్రోలు వారికి సరిసములను కష్టపడి పట్టుకోవాలి.
అది 1916 సంక్రాంతిపండుగ. బెజవాడ రామమోహనగ్రంధాలయపు ఆవరణలో జరుగుతున్న మహోత్సవ సభ. నిండుసభలో ఆంధ్రాభిమానపూరితమైన పద్యలహరిని శ్రావ్యభరితంగా గానంచేసిన వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు . ఆ పద్యాల్లో, తెనుగువాణి వర్ధిల్లింది. తెనుగుకత్తి మెరసింది. తెనుగురేఖ అలరింది. తెనుగుభూమి యావత్తు వసుంధరనే సస్యశ్యామలభరితంకావించింది. 'చావలేదు, చావలేదు, ఆంధ్రుల మహోజ్జ్వల చరిత్ర" హౄదయములు చీల్చి చదువుడో సదయులారా అని సాహితీసందేశాన్నిచ్చాడు.
రాయప్రోలు సుబ్బారావు గారిది ది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం కవిత్వంలో వ్రాసిన దేశభక్తికి ఫక్తు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి రాయప్రోలు.
రాయప్రోలు సుబ్బారావు మొదటి చూపులోనే చూపరులను ఆకట్టుకుంటారని ప్రతీ తి. తమ బెట్టుతో, బింకంతో, ఠీవితో, పల్లెవాటుల వయ్యారంతో, చెక్కుచెదరని క్రాఫింగ్తో నిండుగా ఉండేవారు. ఐతే ఒక పక్క కవిత్వంలో మన వంటి ధీరులింకెందునూ లేరని, ఏదేశమేగినా జాతిగౌరవం నిలపాలని వ్రాస్తూనే, మరొక పక్క తెలంగాణలో ప్రజలు రాజ్యంతో వీరోచితంగా పోరాడుతూండగా నైజాం రాజ్యాన్ని పొగుడుతూ రగడ రచించారన్న పేరు మూటకట్టుకున్నారు.
వారిని గురించి రాస్తూ ఆంధ్రపత్రికలో సాహిత్యంలో కట్టలు తెంచుకుని మరవపారిన వీరి దేశభక్తి నిత్యజీవితాన్ని ముట్టనయినా ముట్టలేదు. ‘అవమానమేలరా అనుమానమేల, భరతపుత్రుడనంచు భక్తితో పలుక’ అని ప్రశ్నించి, ‘కంకణ విసర్జనకిది కాలమగునె’ అని హెచ్చరించిన వీరు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు తఖ్తు పునాదులు ఊగిసలాడే వేళకు, దీక్షాకంకణం తృణకంకణంలాగ విదిల్చివేశారు. వీరు పదవికి, పలుకులకు తగినంతగా ప్రజాహితమేమీ చేయలేదనే ప్రవాదమూ ఉంది. అని వ్రాశారు....
అవమానమేలరా అనుమానమేల, భరతపుత్రుడనంచు భక్తితో పలుక’ అని ప్రశ్నించి, ‘కంకణ విసర్జనకిది కాలమగునె’ అని హెచ్చరించిన వీరు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు తఖ్తు పునాదులు ఊగిసలాడే వేళకు, దీక్షాకంకణం తృణకంకణంలాగ విదిల్చివేశారు. వీరు పదవికి, పలుకులకు తగినంతగా ప్రజాహితమేమీ చేయలేదనే ప్రతి వాదమూ ఉంది. అని వ్రాశారు.
కొన్ని మచ్చు తునకలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వ్రాలినది ఈ భరతఖండము
భక్తిపాడర తమ్ముడా!
వేదశాఖలు పెరిగె నిచ్చట
ఆదికావ్యం బందె నిచ్చట
అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు
ఓరుగల్లున రాజ వీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు
విద్యానగర రాజవీధుల గవితకు పెండ్లి పందిళ్ళు కప్పించునాడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభమెత్తించునాడు
ఆంధ్ర సంతతి కే మహితాభిమాన
దివ్య దీక్షా సుఖ స్ఫూర్తి తీవరించె
నా మహాదేశ మర్థించి యాంధ్రులార
చల్లుడాంధ్రలోకమున నక్షితలు నేడు
తృణ కంకణమునుండి:
అడుగుల బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్
మడుగులు గట్ట, మండు కనుమాలపుటెండ పడంతియోర్తు జా
ఱెడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా
ల్నడకన బోవుచుండె నెడలన్ కనుపించెడి పచ్చతోటలకున్
నిమ్మచెట్టు లేగొమ్ము పందిళ్ళకింద
పుస్తకపు పేటికలను, నా హస్తముదిత
చిత్రసూత్రమునను వసియించియున్న
దోయి!యిందాక మన ప్రేమయును సఖుండ!
రాయప్రోలు సుబ్బారావు గారి ఖండకావ్యాలు, అనువాదాలు
- తృణకంకణము
- ఆంధ్రావళి
- కష్టకమల
- రమ్యలోకము
- వనమాల
- మిశ్రమంజరి
- స్నేహలతా దేవి
- స్వప్నకుమారము
- తెలుగు తోట
- మాధురీ దర్శనం
- రూపనవ నీయతం
- అనుమతి
- భజగోవిందము
- సౌందర్య లహరి
- దూతమత్తేభము
- లలిత
- మధుకలశము
- తెలుగుకవితకు అభినవ దీప్తినొసగి క్రొత్తపుంతలు చూపిన కోవిదుడు;
- ప్రకృతి సౌందర్య దర్శన పధములందు నవ్య పదబంధ నిర్మాణ నాట్యరీతి తెలుగు కవులకు నేర్పిన దేవగురుడు;
- రూపనవనీతమునకు సరోజభవుడు;
- మాధురీదర్శనంబొక మధుర ఫణితి, లలిల తత్త్వార్ధ బోధకు లక్ష్యభూమి, పద్యమయమైన లక్షణ పాఠమునకు విద్య నేర్పిన కల్పక వేదతరువు;
- అతడు పల్కిన కావ్యము లాగములు, అతడు పాడిన గేయములాంధ్రజాతి నిదుర మోల్కొల్పు అన్నది ఎంత సహజభావ ప్రకటన.
- ఏకవిని యింతగా ఆచితూచి, అనుభవించి, పలవరించడం జరగని పని అనే చెప్పాలి.
- రాయప్రోలు సుబ్బారావు యుగకర్త; ఆచార్యుడు; ఆంధ్రవాణికి అభినవాదర్శ మార్గ విద్యాప్రదాత.
- రాయప్రోలువారికి ఆంధ్రసాహితీలోకం, సాహితీరసికులు అంజలి, నివాళి ఏకమాత్రంగా సమర్పించడం తమ విధి, కర్తవ్యం.
రాయప్రోలు వారి తృణకంకణమునకు కట్టమంచి రామ లింగా రెడ్డి గారు వ్రాసిన సందేశము:
MAHARAJA'S COLLEGE, Mysore. 26th May 1916.
Though I have not known Mr. Rayaprolu Subbarao personally, I have been in touch with him by correspondence, common friends, and above all, his own splendid writings in prose and verse. He holds a high rank amongst modern Telugu Poets, and I think he is almost entitled to be acclaimed as the founder of a new school of poetry which is bound to mark a new epoch in the development of Andhra literature. His imaginative gifts are of a high order and his power of phrase is remarkable, almost unique. He will bring name and fame to any institution with which he may be connected. And I, therefore, confidently recommend him as a man of genius who has every title to the admiration and encouragement of the Telugu people.
Signed - C.R.REDDY, M.A. (Cantab) - Principal, Maharaja's College, Mysore.
తెలుగు అనువాదం
మహారాజ కాలేజీ, మైసూర్ , 26 మే 1916 తేదీ :
మిస్టర్. రాయప్రోలు సుబ్బారావు గారు నాకు వ్యక్తిగతంగా తెలియకపోయినప్పటికీ, నాకు అతని గద్య మరియు పద్యాలలో అతని స్వంత అద్భుతమైన రచనలు ప్రచురణ లు ద్వారా సాధారణ స్నేహితులు అందరికంటే ఎక్కువగానే తెలుసు. అతను ఆధునిక తెలుగు కవులలో ఉన్నత గుర్తింపును కలిగి ఉన్నాడు, మరియు ఆంధ్ర సాహిత్య వికాసంలో ఒక కొత్త యుగాన్ని గుర్తుచేసే ఒక కొత్త కవితా పాఠశాల స్థాపకుడిగా ఆయనకు ప్రశంసలు లభిస్తాయని నేను భావిస్తున్నాను. అతని ఊహాత్మక కవితా రచనలు ఎంతో ఆర్ద్రత కలిగివుంటాయి మరియు అతని పదబంధ శక్తి గొప్పది, దాదాపు ప్రత్యేకమైనది. అతను కనెక్ట్ అయ్యే ఏ సంస్థకైనా పేరు మరియు కీర్తిని తెస్తాడు. అందువల్ల, తెలుగు ప్రజల ప్రశంసలు మరియు ప్రోత్సాహాలకు బిరుదులకు తగిన అర్హత ఉన్న మేధావిగా నేను అతనిని నమ్మకంగా తెలుగు వారందరికి సిఫార్సు చేస్తున్నాను.
సంతకం- సి.ఆర్. రెడ్డి ఎం.ఏ., ప్రిన్సిపాల్, మహారాజా కాలేజీ,. మైసూర్.
ఈ క్రింది వీడియో యు. ఆర్.యల్. ల లో రాయప్రోలు గురించి తెలుసుకోండి
- Franklin D. Roosevelt
Note:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు &
గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం
సబ్స్క్రయిబ్ (subscribe) చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My FaceBook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids: